Homeఅంతర్జాతీయంఅఫ్గాన్‌‌లో బాంబు పేలుడు.. 26 మంది మృతి

అఫ్గాన్‌‌లో బాంబు పేలుడు.. 26 మంది మృతి

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌లో మరోసారి తాలిబన్లు తీవ్ర రక్తపాతం సృష్టించారు. ఆదివారం స్థానిక ఆర్మీ బేస్‌ ప్రాంతంలో ఆత్మాహుతి కారు బాంబు పేల్చారు.

ఈ పేలుడు సుమారు 26 మంది ప్రాణాలు కోల్పోయినట్ల తెలుస్తోంది. ఘాజీ నగర శివారు ప్రాంతంలో ఉన్న తూర్పు ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

‘ఈ దాడిలో ఇప్పటివరకు 26 మృతదేహాలను గుర్తించాము. మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ప్రభుత్వ భద్రత సిబ్బంది’ అని స్థానిక ఘాజీ ఆస్పత్రి డైరెక్టర్ బాజ్ మహ్మద్ హేమత్ తెలిపారు.

బామియన్‌లో రెండు బాంబు పేలుళ్ల ఘటనలు మరవక ముందే ఆదివారం ఘాజీలో ఆత్మాహుతి కారు బాంబు దాడి జరిగింది.

ఖతార్‌ రాజధాని దోహాలో గత సెప్టెంబర్ 12న జరిగిన శాంతి చర్చల అనంతరం అఫ్గానిస్తాన్‌లో జరిగిన అతి పెద్ద బాంబు పేలుడు దాడి ఇదే.

Recent

- Advertisment -spot_img