Homeఅంతర్జాతీయంSupreme court: స్వలింగ సంపర్కుల వివాహానికి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు

Supreme court: స్వలింగ సంపర్కుల వివాహానికి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు

Supreme court:స్వలింగ సంపర్కుల వివాహాన్ని ప్రత్యేక వివాహ చట్టం కింద గుర్తించాలంటూ దాఖలైన రెండు పిటిషన్లపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. నాలుగు వారాల్లోగా కేంద్రం సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టుల్లో పెండింగ్​లో ఉన్న కేసుల వివరాలను చెప్పాలని సూచించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్​, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ​.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.హైదరాబాద్​కు చెందిన అభయ్​ దాంగ్​, సుప్రియో చక్రవర్తి జంట ఒక పిటిషన్​ దాఖలు చేయగా.. పార్థ్​ ఫిరోజ్​, ఉదయ్​ రాజ్​ అనే మరో స్వలింగ సంపర్కుల జంట ఈ పిటిషన్​ దాఖలు చేసింది. ఒకే లింగానికి చెందిన ఇద్దరి వివాహానికి గుర్తింపు ఇవ్వకపోవడం.. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 14, 21 కింద సమానత్వ హక్కును ఉల్లఘించడమేనని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు పిటిషనర్లు. ఈ పిల్​పై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని పిటిషనర్​ కోరారు.దిల్లీ హైకోర్టులో సంబంధిత కేసు పెండింగ్​లో ఉన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది

రెండేళ్లుగా కోర్టులో పెండింగ్

దిల్లీ హైకోర్టులో ఈ కేసు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉందని.. ఇది చాలా ముఖ్యమైన అంశమని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టుకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ కేసు ప్రభావం చూపుతుందని అన్నారు. దిల్లీ హైకోర్టులో వాదనలు ఎంతవరకు పూర్తయ్యాయో కూడా తనకు తెలియలేదని ఆయన ధర్మాసనానికి చెప్పారు. తక్షణమే విచారణ చేపట్టాల్సిన అవసరాన్ని వివరించారు. స్పందించిన సుప్రీంకోర్టు.. కేంద్రానికి నోటీసులు ఇచ్చింది

Recent

- Advertisment -spot_img