Homeతెలంగాణసురవరం పాలమూరుకు ప్రతిష్ట

సురవరం పాలమూరుకు ప్రతిష్ట

వనపర్తి, ఇదేనిజం : వనపర్తిలో సురవరం ప్రతాపరెడ్డి 67వ వర్ధంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సురవరం పాలమూరుకు ప్రతిష్ట అన్నారు. సుధీర్ఘకాలం లేకపోయినా 13 నెలలే శాసనసభ్యులుగా ఉన్నా సాహితీ, సాంస్కృతిక, సాంఘీక ఉద్యమాల ద్వారా ఆయన చేసిన కృషి అనన్యసామాన్యం అన్నారు.

వర్తమానానికి, భావితరాలకు సురవరం కృషి తెలియాలని, అది చిరస్మరణీయంగా నిలవాలన్నారు. అందుకే వారి కాంస్య విగ్రహాన్ని వనపర్తిలో సెప్టెంబరు 9న కాళోజి నారాయణరావు జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించబోతున్నాం అని తెలిపారు. తెలంగాణ భాషకు, తెలుగు భాషకు గొప్ప కీర్తిని గడించిన సురవరం విగ్రహం సాహితీ మితృలు, తెలంగాణ వాదుల సూచన మేరకు ఆవిష్కరించుకోవడం గొప్పతనంగా భావిస్తున్నాం అన్నారు మంత్రి.

వనపర్తిలో సురవరం ప్రతాపరెడ్డి  పేరు మీద ఒక పార్కు నిర్మించాలని మున్సిపాలిటీ నిర్ణయించిందని, అందుకు మున్సిపాలిటీ పాలకమండలికి ధన్యవాదాలు తెలిపారు. సురవరం ప్రతాపరెడ్డి ఆశయసాధన కొనసాగింపు తెలంగాణ ఉద్యమంలో జెండాను ఎత్తిన సాధారణ కార్యకర్తగా నా బాధ్యతగా భావించి వారి కీర్తి పతాక చిరస్థాయిగా ఎగరాలని వారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.

సురవరం ప్రతాపరెడ్డి  పేరు మీద ఒక సంచిక 400 పేజీలతో రెండు సంపుటాలుగా తీసుకురావడం జరుగుతుందని, సురవరం మీద అధ్యయనం చేసేందుకు ఈ సంకలనం ఉపయోగపడుతుందని తెలిపారు. సెప్టెంబర్ 9న కాంస్య విగ్రహ ఆవిష్కరణకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, రాష్ట్రంలోని కవులు, కళాకారులు, సాహితీవేత్తలను ఆహ్వానిస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img