Homeతెలంగాణఐపీఎస్‌ అధికారి అంజనీకుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

ఐపీఎస్‌ అధికారి అంజనీకుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

– రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారమిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

ఇదే నిజం, హైదరాబాద్: తెలంగాణకు చెందిన ఐపీఎస్‌ అధికారి అంజనీకుమార్‌ పై విధించిన సస్పెన్షన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఎత్తివేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన సమయంలో రాష్ట్ర డీజీపీగా అంజనీకుమార్‌ ఉన్నారు. ఫలితాలు వెలువడుతున్నప్పుడు ఆయన రేవంత్‌రెడ్డిని వెళ్లి కలిశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ అంజనీకుమార్‌ను ఈసీ సస్పెండ్‌ చేసింది. దీనిపై ఈసీకి వివరణ ఇచ్చుకున్న ఆయన.. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించలేదని తెలిపారు. ఎన్నికల ఫలితాల రోజు రేవంత్‌రెడ్డి పిలిస్తేనే వెళ్లానని.. మరోసారి ఇలా జరగదని అంజనీకుమార్‌ హామీ ఇచ్చారు. దీంతో ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ సమాచారం ఇచ్చింది.

Recent

- Advertisment -spot_img