Homeహైదరాబాద్latest Newsఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ

ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ

దే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నేడు ఆషాడ శుద్ధ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి అలాగే అనుబంధ దేవాలయములలో గల స్వామివార్లకు పంచోపనిషత్తులతో(పాలతో) క్షీరాభిషేకం చేయడం జరిగింది.
అలాగే ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ముందుగా గోదావరి నదిలో స్నానం ఆచరించి.. తదుపరి స్థానిక దైవమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని అలాగే అనుబంధ దేవాలయములలో గల శ్రీ స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు.

Recent

- Advertisment -spot_img