ఈ మెగా టోర్నీకి న్యూజిలాండ్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. అయితే బీసీసీఐ నేడు లేదా రేపు భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. టీమ్ను ప్రకటించేందుకు రేపటితో గడువు ముగుస్తున్నందున ఈరోజే జట్టును ప్రకటించే అవకాశం ఉంది. జట్టు ఎంపిక విషయంలో ఐపీఎల్ ప్రదర్శనపై సెలక్టర్లు పెద్దగా దృష్టి పెట్టకపోవచ్చని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే 2 రోజుల పాటు జట్టు ఎంపికకు సెలక్టర్లు సన్నాహాలు చేస్తున్నారు. అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాళ్లకు వారు మొగ్గు చూపవచ్చని సమాచారం.