T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ అంబాసిడర్గా యువరాజ్
టీ20 ప్రపంచ కప్ 2024 బ్రాండ్ అంబాసిడర్గా టీమ్ ఇండియా దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ను ఐసీసీ నియమించింది. ఐసీసీ ఇప్పటికే జమైకన్ రన్నింగ్ చిరుత ఉసేన్ బోల్ట్ మరియు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్లను అంబాసిడర్గా నియమించింది. తాజామూడో బ్రాండ్ అంబాసిడర్గా యువరాజ్ సింగ్ను ఎంపిక చేసింది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికల పైన జూన్ 1 నుంచి 29 వరకు టీ20 ప్రపంచకప్ 2024 జరగనున్న సంగతి తెలిసిందే. అమెరికాలో క్రికెట్కు ప్రాచుర్యం కల్పించాలనే సంకల్పంతో ఐసీసీ అగ్రరాజ్యంగా ప్రపంచకప్ను నిర్వహిస్తోంది. టీ20 ప్రపంచకప్ లో భాగంగా న్యూయార్క్ తో పాటు అమెరికాలోని ప్రధాన నగరాల్లో క్రికెట్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ క్రమంలోనే బ్రాండ్ అంబాసిడర్గా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఎంపికయ్యాడు. అమెరికా అంతటా ఆయనకు మంచి పేరుంది. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రిస్ గేల్ను ఐసీసీ రెండో అంబాసిడర్గా ఎంపిక చేసింది. అలాగే టీమిండియా దిగ్గజ ఆల్రౌండర్, సిక్సర్ల సింగ్ యువరాజ్ సింగ్ను మూడో అంబాసిడర్గా ఎంపిక చేశారు.