టీమిండియా టీ20 వరల్డ్కప్ జట్టుపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్ తన జట్టును ప్రకటించడంతోనే రిస్క్కు సిద్ధమైంది. స్పిన్నే ఎక్కువగా నమ్ముకుంది. కరీబియన్ పరిస్థితుల్లో స్పిన్ను ఎదుర్కోవడంపైనే టీమిండియా విజయాలు ఆధారపడి ఉంటాయి. విండీస్, భారత్ మధ్య పరిస్థితులు భిన్నంగా ఉండొచ్చేమో కానీ.. కొన్ని పోలికలూ ఉన్నాయి. అవి టీమిండియాకు ఉపయోగకరంగా మారతాయి’’అని క్లార్క్ తెలిపారు.