Homeహైదరాబాద్latest NewsT20 World Cup: టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియా షాక్.. కీలక మ్యాచ్‌కు కోహ్లి దూరం..?

T20 World Cup: టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియా షాక్.. కీలక మ్యాచ్‌కు కోహ్లి దూరం..?

మరో ఆరు రోజుల్లో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీని అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.టీ20 కప్ గెలిచి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచేందుకు రోహిత్ సేన నిన్న అమెరికా బయలుదేరింది. అయితే ప్రపంచకప్‌కు ఎంపికైన కొందరు భారత ఆటగాళ్లు నిన్న అమెరికా వెళ్లలేదు. ఐపీఎల్ కారణంగా రెండు బ్యాచ్ లు అగ్రరాజ్యానికి వెళ్తున్నాయి. తొలి బ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, కోచ్ రాహుల్ ద్రవిడ్ నిన్న విమానమెక్కారు.
అయితే తొలి బ్యాచ్‌తో పాటు విరాట్ కోహ్లీ కూడా అమెరికా వెళ్లాల్సి ఉంది. కానీ అతను జట్టుతో వెళ్లలేదు. కోహ్లీకి దుబాయ్‌లో వ్యక్తిగత పని ఉండడంతో భారత జట్టులో చేరడం ఆలస్యమవుతుంది. ఈ విషయాన్ని కోహ్లీ ముందుగానే బీసీసీఐకి తెలియజేశాడు. ఇందుకు భారత క్రికెట్ బోర్డు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే జూన్ 1న బంగ్లాదేశ్‌తో జరిగే వార్మప్ మ్యాచ్‌కు కోహ్లీ దూరం కానున్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆడే ఏకైక వార్మప్ మ్యాచ్. అమెరికా పరిస్థితులను అర్థం చేసుకోవడానికి భారత ఆటగాళ్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు కోహ్లీ దూరం కానున్నాడు.

Recent

- Advertisment -spot_img