Homeజిల్లా వార్తలుప్రజాపాలనను సద్వినియోగం చేసుకోండి

ప్రజాపాలనను సద్వినియోగం చేసుకోండి

ఇదేనిజం, నల్లబెల్లి: అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రజా పాలనలో ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావిణ్య సూచించారు. నల్లబెల్లి మండల పరిధిలోని నందిగామ గ్రామంలో సర్పంచ్ నాగులగాని సలేంద్ర నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అభయహస్తం స్వీకరణ కేంద్రాలను ఆమె పరిశీలించారు. 6 గ్యారంటీ పథకాల కలిపి ఒకే దరఖాస్తు ఇస్తే చాలు అన్నారు. ఇంటి యజమాని ఆధార్ రేషన్ కార్డ్ వివరాలు జత చేస్తే సరిపోతుందన్నారు. ప్రభుత్వం అందించిన దరఖాస్తు పత్రలతో పాటు జిరాక్స్ పత్రాల ద్వారా కూడా దరఖాస్తు చేయవచ్చని చెప్పారు. అభయ హస్తం దరఖాస్తులు తీసుకోవడంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రేషన్ కార్డుల గురించి గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి, స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ రాజేష్, ఎంపీడీవో విజయ్ కుమార్, ఎంపిఓ ప్రకాష్, ఆర్ఐ ప్రసాద్, పంచాయితీ కార్యదర్శి వద్దిరాజు, ఇతర గ్రామ కార్యదర్శులు, ఏఎన్ఎం, ఆశ వర్కర్స్, గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img