అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా కీలక ప్రకటన చేశారు. ‘త్వరలో భూమిలేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేల అందిస్తాం. రూ.2లక్షల వరకు రుణం ఉన్న రైతులకు త్వరలో రుణమాఫీ చేస్తాం. రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.15వేలు ఇవ్వాలన్నది మా సంకల్పం. ప్రధాని ఫసల్ బీమా యోజనలో చేరబోతున్నాం’ అని తెలిపారు.