రెండేళ్ల బీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. నల్గొండలోని మహాత్మాగాంధీ వర్సిటీ ఆధ్వర్యంలో మే 23న జరిగిన TG EdCET 2024 పరీక్ష ప్రిలిమినరీ కీని ఇటీవల విడుదల చేసిన అధికారులు.. తాజాగా ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30వేల మంది హాజరయ్యారు. ఫలితాల కోసం ఈ లింక్ను https://edcet.tsche.ac.in క్లిక్ చేయండి.