HomeరాజకీయాలుTelangana Elections : ఎన్నికల వేళ.. BJP కి మరో షాక్

Telangana Elections : ఎన్నికల వేళ.. BJP కి మరో షాక్

– పార్టీకి రాజీనామా చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపి
– కులాల పేరుతో ఈటల రాజకీయం చేస్తున్నడని ఆరోపణలు

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపి ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం నర్సాపూర్‌లో బీజేపీ అసమ్మతి నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గోపి మీడియాతో మాట్లాడారు. కులాల పేరుతో ఈటల రాజేందర్ రాజకీయం చేయడం సరికాదన్నారు. గత 6 నెలల్లో బీజేపీలో సమీకరణాలు మారాయన్నారు. కొత్త వాళ్లు పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ కలుషితమైందని ఆరోపించారు. కుట్ర పూరితంగానే బండి సంజయ్‌ను పార్టీలో నుంచి తప్పించారని మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడే వారికి బీజేపీలో ప్రాధాన్యత లేదని వాపోయారు. రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలేదని ఆవేదన చెందారు. ఇప్పుడు బీజేపీలో తమకు గౌరవం లేదని వెల్లడించారు. తెలంగాణలో ఎమ్మెల్యే సీట్లు అమ్ముడుపోతున్నాయని బీజేపీ అధిష్టానం గుర్తించాలని కోరారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కార్యకర్తల ఫోన్ ఎత్తే పరిస్థితుల్లో లేరని గోపి ఆరోపించారు.

Recent

- Advertisment -spot_img