HomeరాజకీయాలుTelangana Elections : Congress పార్టీకి పాల్వాయి స్రవంతి Good Bye

Telangana Elections : Congress పార్టీకి పాల్వాయి స్రవంతి Good Bye

– ఎన్నికల వేళ గట్టి షాక్​
– మునుగోడు టికెట్ దక్కకపోవడంతో మనస్తాపం
– త్వరలో బీఆర్ఎస్​లోకి..

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: పాల్వాయి స్రవంతి రెడ్డి కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పార్టీకి గట్టి షాక్​ తగిలినట్టైంది. గత ఉప ఎన్నికల్లో ఆమె మునుగోడు కాంగ్రెస్​ అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్​ పార్టీలో చేరడంతో టికెట్​ అతడికే వచ్చింది. దీంతో స్రవంతి రెడ్డి మనస్తాపంతో ఉన్నారు. పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. తొలత ఆమె ఖండించారు. అయితే తాజాగా ఆమె కాంగ్రెస్​ పార్టీకి గుడ్​ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ.. నాలుగు పేజీల లేఖను అధిష్ఠానానికి పంపారు. త్వరలో బీఆర్ఎస్​ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img