Homeహైదరాబాద్latest Newsగొల్లపెల్లిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గొల్లపెల్లిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఇదే నిజం, గొల్లపెల్లి : జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎంఆర్ఓ, ఎంపిడిఓ, గ్రామ పంచాయతీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంగం, ప్రాథమిక పశు వైద్య కేంద్రం, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయంలోను తెలంగాణ ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశానుసారం, ముస్కు నిశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అమర వీరులను స్మరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారి త్యాగం గొప్పదని కొనియాడారు.

సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందిదని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు భీమా సంతోష్, మాజీ సర్పంచులు చిర్ర గంగాధర్, సరసాని తిరుపతి రెడ్డి, పురాంశేట్టి వెంకటేష్, ఎంపీటీసీ లంబ లక్ష్మణ్, బీసీ సెల్ మండల అధ్యక్షులు గంగాధర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఓరుగంటి తిరుపతి, ఓర్సు విజయ్, కొలగాని తిరుపతి, ఆవుల ప్రవీణ్, దాసరి వెంకటేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సూరిగినేని రాజేశ్వర రావు, ఎల్లలా రామ్ మోహన్ రెడ్డి, ఉటూరి సతీష్ గౌడ్, దాసరి తిరుపతి గౌడ్, గడ్డం తిరుపతి రెడ్డి, పులి మల్లయ్య, పల్లెర్ల నారాయణ, కొండ వెంకటేష్ గౌడ్, నక్క కొమురయ్య, జంగం నాగయ్య, కందుకూరి శ్రీనివాస్, ఎల్లలా లింగారెడ్డి పట్టణ అధ్యక్షుడు నేరెళ్ల మహేష్, తుల్ల అజయ్, గంగాధర్, మధుసూదన్, చిర్ర దిలీప్, చెవులమద్ది గంగాధర్, పురంశేట్టి గౌతమ్, నలువల రమేష్, జలిగామ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img