తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి.నేడు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 91.31 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ https://results.bsetelangana.org/ నుండి చూసుకోవచ్చు. ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి వెంకటేశం తెలిపారు. మే 16 నుంచి పరీక్ష వివరాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. రీ వెరిఫికేషన్ కోసం 15 రోజుల్లోగా రూ. 500 చెల్లించాలని తెలిపారు.