సిటీ ప్రయాణికులకు టిజిఎస్ఆర్టిసి (TGSRTC) శుభవార్త చెప్పింది. ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ బస్ పాస్ ధరను భారీగా తగ్గించింది. రూ.2,530 బస్సు పాసు ధరను రూ.1900కే అందించనుంది. ఈ బస్పాస్తో మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును TGSRTC కల్పించనుంది. అయితే ఈ బస్సు పాస్ ఎయిర్పోర్టు రూట్లో నడిచే పుష్పక్ ఏసీ బస్సులో చెల్లదని స్పష్టం చేసింది.