హైదరాబాద్- పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ హైవే మెయిన్ రోడ్డు పిల్లర్ నెంబర్ 106 వద్ద శ్రీ రాఘవేంద్ర హోటల్లో ఓ కస్టమర్ తినే దోసలో వచ్చిన మాడిపోయిన బొద్దింక వచ్చింది. దోసెను తినడానికి రెడీ అయిన కస్టమర్ ఈ బొద్దింకను చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఇది చూసిన కస్టమర్ ఆందోళనకు గురయ్యాడు. అలాగే హోటల్పై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరాడు. దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.