Homeహైదరాబాద్latest Newsతల్లి మరణం తట్టుకోలేక కొడుకు మృతి

తల్లి మరణం తట్టుకోలేక కొడుకు మృతి

– మెదక్​ జిల్లాలో విషాదం

ఇదే నిజం, కౌడిపల్లి: తల్లి మరణం తట్టుకోలేక కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మెదక్​ జిల్లాలో చోటు చేసుకున్నది. కౌడిపల్లికు చెందిన దొంత లలిత (70) ఆదివారం గుండె పోటుతో చనిపోయింది. తల్లి మృతిని కొడుకు నరేందర్ (45) తట్టుకొలేక పోయాడు. అదే అంత్యక్రియలు పూర్తి చేశారు. సోమవారం తెల్లవారు జామున నరేందర్ కూడా గుండెపోటు వచ్చి మరణించాడు. ఒకే ఇంట్లో తల్లీ, కొడుకులు గుండె పోటుతో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Recent

- Advertisment -spot_img