ఎట్టకేలకు టీఎస్ పీఎస్సీ చైర్మన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిసెంబర్ లో టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి, అలాగే ఐదుగురు సభ్యుల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే రాజీనామాలను గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ న్యాయపరమైన సలహాల కోసం ఇన్ని రోజులు పెండింగ్ లో ఉంచారు. అయితే ఎట్టకేలకు ఈ రోజు గవర్నర్ రాజీనామాలను ఆమోదించారు. అయితే త్వరలోనే ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేయునున్నది.