Homeహైదరాబాద్latest Newsధర్మపురిలో ఘనంగా దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ జన్మదిన వేడుకలు

ధర్మపురిలో ఘనంగా దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ జన్మదిన వేడుకలు

ఇదే నిజం, ధర్మపురి: దివంగత నేత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ శ్రీ వై. ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా సోమవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్మపురి పట్టణంలోని స్థానిక నంది విగ్రహం వద్ద జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేసి పెద ప్రజల గుండెల్లో చిర స్థాయిలో వైయస్ఆర్ ఉంటారని, ప్రజలు సమస్యలతో ఎప్పుడు వచ్చిన వారి సమస్యలను అక్కడికక్కడే వెంటనే పరిష్కరించే వారని,తను యువజన కాంగ్రెస్ నాయకుడు గా ఉన్నప్పుడు వారిని కలిసినప్పుడు వారు ఒక్కటే మాట అనేవారని ఓడిన గెలిచిన ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్తుండే వారని,ఆరోగ్య శ్రీ,ఉచిత కరెంటు వంటి ఎన్నో పథకాలు అమలు చేసిన మహానుభావుడని,వారి జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని, వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని సందర్భంగా కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంఘటన బట్ల దినేష్, వేముల రాజేష్, చిలుముల లక్ష్మణ్, సింహరాజు ప్రసాద్, రామ్ దిన్ మొగిలి ,కుంట సుధాకర్, బొల్లారం పోచయ్య, కుంభాల మల్లేష్, జిల్లా పెళ్లి రవి, కాసెట్టి రాజు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img