మూస ధోరణిలో కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్లతో సినిమాలు చేస్తున్న టాలీవుడ్ హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. సందీప్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఊరు పేరు భైరవకోన’. ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, రిలీజ్కు ముందే మంచి బజ్ తెచ్చుకున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. పోస్టర్ ఆడియెన్స్ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా నుంచి రిలీజైన ప్రమోషన్లకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కావ్య థాపర్, హర్ష చెముడు, రాజశేఖర్ అనింగి, వెన్నెల కిషోర్, మరియు కుశీ రవి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీలో వర్ష బొల్లమ్మ హీరోయిన్. హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నాడు.