Homeజిల్లా వార్తలుఆరో వార్డులో కొనసాగుతున్న ప్రజా పాలన

ఆరో వార్డులో కొనసాగుతున్న ప్రజా పాలన

– గ్యారెంటీ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలి
– ఆరో వార్డ్ కౌన్సిలర్ ఆదాసు నాగరాణి విక్రమ్

ఇదే నిజం, నాగార్జునసాగర్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టగా చేపట్టిన ప్రజా పాలన గ్యారెంటీ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని నందికొండ మున్సిపాలిటీ ఆరో వార్డ్ కౌన్సిలర్ ఆదాసు నాగరాణి విక్రమ్ కోరారు. శనివారం నందికొండ మున్సిపాలిటీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రజా పాలన కార్యక్రమాన్ని కౌన్సిలర్లు ఆదాసు నాగరాణి విక్రమ్, జి. రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ.. పేద ప్రజలు సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మునిసిపాలిటీ కమిషనర్ ప్రతాప్ రెడ్డి,స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసు, సాగర్ రెడ్డి, శివ కుమారు, విష్ణు, చుక్క నిర్మల, భాను, వెంకోజీ,మున్సిపాలిటీ సిబ్బంది,ఆరోగ్యశాఖ సిబ్బంది,పోలీస్ శాఖ, తదితరులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img