టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”జీవితంలో కేవలం విజయం సాధించినప్పుడు సంబరాలు చేసుకోవడమే కాదు.. క్లిష్ట పరిస్థితుల్లోనూ నిబ్బరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. కఠినంగా శ్రమించేందుకు ముందడుగు వేయాలి. సక్సెస్తో సంబంధం లేకుండా కష్టపడాలి. నావరకైతే అదే అసలైన గేమ్. ఇదంతా దేవుడి పరీక్షగా భావించాలి. ఉన్నతస్థాయిలో కష్టపడకపోతే.. వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేం’’ అని విరాట్ కోహ్లీ వెల్లడించాడు.