Homeజిల్లా వార్తలుకూరగాయల మార్కెట్‌లో పేలిన ఫోన్‌

కూరగాయల మార్కెట్‌లో పేలిన ఫోన్‌

ఇదేనిజం, గద్వాల : జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గంజి కూరగాయల మార్కెట్‌లో ఫోన్‌ పేలింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం బీసీ కాలనీకి చెందిన జయరాముడు అనే వ్యక్తి కూరగాయల మార్కెట్‌కి వచ్చారు. కూరగాయలు కొనుగోలు చేసే సమయంలో ఒకసారిగా జేబులోని ఫోన్‌ పేలింది. అప్రమత్తమైన అతను ఫోన్‌ బయటకు పడేశాడు. అప్పటికే ప్యాంట్‌ కొంత కాలిపోయింది. అదృష్టవశాత్తు ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Recent

- Advertisment -spot_img