– యూనియన్ నాయకుడు కట్ట రామ్ కుమార్
– పట్టణంలో నిరసన
ఇదే నిజం, బెల్లంపల్లి : ఆటో డ్రైవర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆ యూనియన్ లీడర్ కట్ట రావమ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సామాజిక భద్రత కల్పించాలని, ప్రతి పట్టణంలో ఆటోనగర్లు ఏర్పాటు చేయాలని, రవాణా వాహనాల ఫిట్నెస్ చాలన్లను సంవత్సరానికి ఒకసారి సమీక్షించాలని, ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు అమలు చేసిన రోజు నుంచి ఆటోలలో వెళ్లే ప్రయాణికులు లేక ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని, అందరికీ ఫ్రీ సర్వీస్ ఎత్తివేసి దివ్యాంగులకు, 60ఏళ్ల పైబడి వారికి, విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.