మాస్ మహారాజా రవితేజ హీరోగా నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా దర్శకుడు వంశీ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ నెల 20న సినిమా రిలీజ్ కానుండగా.. ఇప్పటికే ప్రమోషన్లు భారీగా చేస్తున్నారు. అయితే టైగర్ నాగేశ్వరరావు మూవీ తాజాగా సెన్సార్ను కంప్లీట్ చేసుకున్నట్లు మేకర్స్ కన్ఫార్మ్ చేశారు. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ను అందించింది. ఫైనల్ రన్ టైమ్ 2 గంటల 52 నిమిషాలు ఉన్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొగా.. రవితేజ ఫ్యాన్స్ సైతం ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.