దేశవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగానే నమోదవుతున్నాయి. ఆ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో వేడిగాలుల కారణంగా వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే బీహార్, జార్ఖండ్లకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. బెంగాల్, ఒడిశాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా శనివారం బెంగాల్, ఒడిశాలో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.