Homeక్రైంతండ్రిని హతమార్చిన కొడుకు

తండ్రిని హతమార్చిన కొడుకు

ఇదేనిజం,పెద్దపల్లి: తండ్రిని కొడుకు బండరాయితో మోది హతమార్చాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మునిసిపాలిటీ పరిధిలోని పూసాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన తీగల నరసయ్య, రాజేశం తండ్రీ కుమారుడు. పూసాలలోని ఐకేపీ సెంటల్‌లో ధాన్యం విక్రయించేందుకు వచ్చారు. అయితే, ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆవేశానికి గురైన కుమారుడు రాజేశం బండరాయితో తండ్రి నరసయ్య తలపై గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img