రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిథిలో ఉన్న ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణ, ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు ప్రాంతాన్ని సబ్ అర్బన్, రీజినల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు గ్రామీణ తెలంగాణ జోన్గా విభజిస్తున్నట్లు వెల్లడించారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించారు.