Homeహైదరాబాద్latest Newsఅక్కడ దంచికొడుతున్న ఎండ‌లు.. న‌లుగురు ఓట‌ర్లు మృతి..!

అక్కడ దంచికొడుతున్న ఎండ‌లు.. న‌లుగురు ఓట‌ర్లు మృతి..!

నేడు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కేరళలో వేడిగాలులు ఎక్కువగా ఉన్నాయి. కానీ లోక్ సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో.. ఓటర్లు హడావుడిగా పోలింగ్ బూత్ లకు చేరుకుంటున్నారు. అయితే పాలక్కాడ్, మలప్పురం, అలప్పుజ నియోజకవర్గాల్లో ముగ్గురు ఓటర్లు చనిపోయారు. కోజికోడ్‌లో ఓ పోలింగ్ ఏజెంట్ మృతి చెందాడు. బెంగుళూరులో కూడా ఇలాంటి హీట్‌వేవ్ పరిస్థితులే ఉన్నాయి. బెంగుళూరు నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది. బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు రూరల్, బెంగళూరు సౌత్ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది.

Recent

- Advertisment -spot_img