Homeహైదరాబాద్latest Newsవీఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరించాలి.. సీఎం రేవంత్ కు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ

వీఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరించాలి.. సీఎం రేవంత్ కు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ

ఇదేనిజం, రాయికల్: ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించే వీఆర్ఓ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పున రుద్ధరించాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేఖను పంపారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులైన వారికి అందించడంతో పాటు భూసమస్యలు పరిష్కారంలో గ్రామ రెవెన్యూ అధికారులు కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీతో పాటు పదో న్నతుల్లో వివక్ష చూపుతున్నారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తోనే తమ ఉద్యోగాలకు భద్రత లభిస్తుందని, తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే విశ్వాసంతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సైతం గ్రామ గ్రామాన ప్రజల్లో తెలంగాణ భావజాల వ్యాప్తి పెంపొందించడంతో పాటు తెలం గాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించి, భాగస్వాములు అయిన వీఆర్వో వ్యవస్థనే రద్దు చేయడం దురదృష్టకమన్నారు.

క్షేత్రస్థాయిలో వీఆర్ఓ వ్యవస్థకు ఎటువంటి ప్రత్యామ్నయం ఏర్పాటు చేయకుండ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లోని వీఆర్ఓ వ్యవస్థను ఏకపక్షంగా రద్దు చేస్తున్నామంటూ రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న సుమారు ఐదు వేల వీఆర్వో పోస్టు లను ఒక్క కలం పోటుతో రద్దు చేసి, రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఐదు వేల ఖాళీ పోస్టుల్లో వీఆర్ఓలను సర్దుబాటు చేయడంతో సుమారు 10 వేలకు పైగా ప్రభుత్వ విభాగాల్లో భర్తీ చేసే పోస్టు లను రద్దు చేసి, నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారన్నారు. ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు చేయటంలో కీలక పాత్ర పోషించిన వీఆర్ఓల సేవలను మరోమారు వినియోగించు కోవాలని సీఎం రేవంత్ రెడ్డి కి సూచించారు.

Recent

- Advertisment -spot_img