తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 3035 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి టీజీఎస్ఆర్టీసీ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో నోటిఫికేషన్ ఇచ్చినట్లు కొన్ని లింక్లు పెడుతున్నారు. దీనిపై ఆర్టీసీ స్పందించింది. తాము ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని తేల్చిచెప్పింది. ఇందుకు సంబంధించి ఎక్స్లో ట్వీట్ చేసింది.