Homeతెలంగాణవారిని ఆరు గ్యారెంటీల్లో చేర్చాలి: చల్లా ధర్మారెడ్డి

వారిని ఆరు గ్యారెంటీల్లో చేర్చాలి: చల్లా ధర్మారెడ్డి

ఇదేనిజం, వరంగల్: బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకంలో పరకాల నియోజకవర్గంలో నూతనంగా ఇండ్లు నిర్మాణం చేపట్టిన 3000 మంది లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం మేనిఫెస్టోలోని ఆరు గ్యారెంటీల్లోని ఇందిరమ్మ ఇండ్లు లబ్దిదారులల్లోకి చేర్చి రూ.5 లక్షల ఆర్ధిక సహాయం అందచేయాలని ఎమ్మెల్యే హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ని కలిసి మెమొరాండం సమర్పించారు. గృహలక్ష్మి పథకంలో రూ.3 లక్షల ఆర్ధిక సహాయం అందుతుందని ఉద్దేశంతో లబ్దిదారులంతా పాత గృహాలు కూల్చేసి నూతన ఇండ్ల నిర్మాణం చేపట్టారని తెలిపారు

Recent

- Advertisment -spot_img