జోగిపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు
ఇదే నిజం, జోగిపేటః అందోలు మండలం సంగుపేట గ్రామంలో గుర్తు తెలియని దొంగలు వ్యవసాయ భూమి వద్ద ఉన్న మూడు ఎద్దులను వాహనంలో తీసుకువెళ్లిపోయినట్లు భాదితులు జోగిపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన ఈషామోద్దిన్కు చెందిన రూ.1.50 లక్షల విలువ చేసే ఎద్దులు, బంటు అనంతయ్యకు చెందిన రూ. 54వేల విలువ చేసే ఎద్దును బుధవారం రాత్రి పొలం వద్ద కట్టేసి ఉన్న వాటిని వాహనంలో తీసుకువెళ్లినట్లుగా గుర్తులు ఉన్నాయని భాదితులు పోలీసులకు తెలిపారు. చుట్టు ప్రక్క గ్రామాలల్లో వెతికినా ఎక్కడా ఆచూకీ లభించలేదని, సింగూరు చౌరస్తా వద్ద గల టోల్గేట్ వద్ద నున్న సీసీ పుటేజీలను పరిశీలించి నిందితులను పట్టుకొని న్యాయం చేయాలని భాదితులు కోరారు.