Homeహైదరాబాద్latest Newsఢిల్లీ పోలీసుల నోటీసుల పై సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే!

ఢిల్లీ పోలీసుల నోటీసుల పై సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కి ఆదేశాలు జారీ చేశారు. మే 1న విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. అయితే గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు రావడంపై సీఎం రేవంత్ స్పందించారు. ‘ఢిల్లీ పోలీసులకు భయపడేది లేదు. ప్రశ్నిస్తున్న వారిపై ఈడీ, సీబీఐ, ఐటీని ప్రయోగించడం అయిపోయింది. ఇప్పుడు ఢిల్లీ పోలీసులను రంగంలోకి దించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం చేయాలని చూస్తున్నారు. బీజేపీపై పోరాడే వారికే అమిత్ షా నోటీసులు ఇస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులు వస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం’ అని రేవంత్ అన్నారు.

Recent

- Advertisment -spot_img