Homeహైదరాబాద్latest Newsఇదే నిజం ఎఫెక్ట్ : స్పందించిన విద్యుత్ శాఖ

ఇదే నిజం ఎఫెక్ట్ : స్పందించిన విద్యుత్ శాఖ

ఇదే నిజం, వేమనపల్లి : ప్రమాదం జరిగితే గానీ పట్టించుకోరా అనే ‘ఇదే నిజం’ పత్రికలో శుక్రవారం వచ్చిన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు. మండలంలోని ముల్కలపేట గ్రామం నుంచి రాచర్ల, వెంచపల్లి వెళ్లే ప్రధాన రోడ్డు చర్చి పక్కన ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని అధికారులు పట్టించుకోకపోవడం లేదని స్థానికులు ఆరోపించారు. ఈ విషయాన్ని ఇదేనిజం వార్త రూపంలో ప్రచురించింది. స్పందించిన అధికారులు ఏఈ దీక్షిత్ రెండు విద్యుత్ స్తంభాలను సరి చేసి విద్యుత్ లైన్‌ను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏఈ దీక్షిత్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎక్కడైనా విద్యుత్ తీగలు వేలాడుతూ కనపడితే వెంటనే విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ప్రజా సమస్యలను అధికారులకు, ప్రజా ప్రతినిధులకు నిత్యం తెలుపుతూ వాటి పరిష్కారం దిశగా వార్తా కథనాలు అందిస్తున్న’ఇదే నిజం’ పత్రికకు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Recent

- Advertisment -spot_img