Homeహైదరాబాద్latest Newsమరో మూడురోజులు అధిక ఉష్ణోగ్రతలు

మరో మూడురోజులు అధిక ఉష్ణోగ్రతలు

ఏపీ, తెలంగాణల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. అయితే మే నెలలో మరిన్ని అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు మధ్యాహ్నం పూట బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 6వ తేదీ వరకు కర్ణాటక, ఏపీ, తెలంగాణ, పుదుచ్చేరిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని సూచించింది. జార్ఖండ్‌లో మే 4 వరకు.. కేరళ, తమిళనాడులో మే 3 వరకు తీవ్రమైన ఎండలు ఉంటాయన్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్రల్లో మే 5 వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Recent

- Advertisment -spot_img