Homeహైదరాబాద్latest Newsఅక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులు అరెస్ట్.. 6 కిలోల గంజాయి సీజ్

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులు అరెస్ట్.. 6 కిలోల గంజాయి సీజ్

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల ధర్మపురి శాఖ పోలీస్ పరిధిలో అంతర్రాష్ట్ర డ్రగ్ (గంజాయి) రాకెట్ నిందితులను ముగ్గురిని ధర్మపురి పోలీసులు అరెస్టు చేసినట్లు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ నిందితుల వివరాలను వెల్లడించారు. నిందితులలో ఇద్దరు చిరు వ్యాపారులు ఒకరు ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారు, మరొకరు ఏపీకి చెందినవారు, మరొకరు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని దంతాపూర్ గ్రామానికి చెందిన వాడుగా గుర్తించారు. ఈనెల 4 న ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ డి పి ఎస్ చట్టం కింద బత్తిని చందు గొల్ల వెంకటేష్, దుర్గం రాము లపై ధర్మపురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది. ఆ కేసులో బత్తిని చందు, గొల్ల వెంకటేశ్వర్లు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. అయితే దుర్గం రాములు పరారీలో ఉండగా అతనిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా బుధవారం రాత్రి ఉద్దేశపళ్ల బస్టాప్ లో నిందితులు దుర్గం రాము గురించి ఉదయ్ కుమార్ ఎస్సై కి సమాచారం అందగా తన సిబ్బందితో ప్రదేశానికి వెళ్లి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ రోజు మీడియా సమావేశంలో డిఎస్పి రఘు చందర్, సిఐ రామ్ నర్సింహారెడ్డి, ధర్మపురి ఎస్సై పి ఉదయ్ కుమార్, గొల్లపల్లి ఎస్సై సతీష్ సిబ్బంది అశోక్ సిబ్బంది బి రమేష్ నాయక్, పూర్ణ సాయి, ఎం రమేష్ ,రామస్వామి ,అశోక్, ఎండి సలిముద్దీన్ ,వెంకటయ్య ,నవీన్ సిబ్బంది పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img