న్యూ ఢిల్లీ : కరోనా వైరస్ నేపథ్యంలో అనేక రంగాలు కుదెలయ్యాయి. వీటిపై ఆధారపడ్డవారు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.
ఢిల్లీ, జీబీ రోడ్డులోని చాలామంది సెక్స్ వర్కర్ల జీవితంలోనూ కరోనా పెను మార్పులు తీసుకువచ్చింది.
నరక కూపంనుంచి బయటపడదామని అనుకుంటూ.. పూట గడవదన్న భయంతో ఏటూ కదల్లేని పరిస్థితుల్లో ఉన్న వారికి మార్గాన్ని సుగమం చేసింది.
కరోనా కారణంగా వేశ్యా వృత్తి తీవ్రంగా నష్టపోయింది. దీంతో వారు వేరే ఉపాది వెతుక్కోక తప్పలేదు. ఈ నేపథ్యంలో ‘హునర్ జ్యోతి’ కార్యక్రమం వారికి అండగా నిలిచింది.
మట్టి దీపాలకు రంగులు వేయటం, కాగితపు బ్యాగులు తయారు చేయటం, అగరుబత్తీలు, కీ రింగుల తయారీ, ఫ్యాబ్రిక్ పనుల్లో శిక్షణననిచ్చి ఉపాధి కల్పిస్తోంది.
2000 మంది వేశ్యల్లో దాదాపు 20 శాతం మంది లాక్డౌన్ సమయంలో ఈ వృత్తుల వల్ల ఉపాధి పొందుతున్నారు. మరి కొంతమంది నగరాన్ని విడిచి సొంత గ్రామాలకు వెళ్లిపోయారు.
‘హునర్ జ్యోతి’ కార్యక్రమం గురించి ఓ వేశ్య మాట్లాడుతూ.. ‘‘ నేను 12 ఏళ్లుగా ఈ వృత్తినుంచి బయటపడదామని అనుకుంటున్నాను. కానీ, కుదర్లేదు. ‘హునర్ జ్యోతి’తో ఆ అవకాశం లభించిందని’’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది.