హైదరాబాద్: భారీ వర్షాలతో అల్లాడుతున్న భాగ్యనగరం కోసం టాలీవుడ్ సెలబ్రిటీలు కదిలి వచ్చారు. తాము సైతం హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వానికి భారీగా విరాళాలు ప్రకటించారు.
మొదట నాగార్జున తన వంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు విరాళం అందించబోతున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు.
ఆపై చిరంజీవి, మహేశ్బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, విజయ్ దేవరకొండ, త్రివిక్రమ్, హరీష్ శంకర్ తదితరులు విరాళాల్ని ప్రకటించారు. వీరందరికీ మంత్రి కేటీఆర్ ట్విటర్లో ధన్యవాదాలు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి రూ.కోటి, మహేశ్బాబు రూ.కోటి, జూనియర్ ఎన్టీఆర్ రూ.50 లక్షలు, ప్రభాస్ రూ.కోటి, విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు, త్రివిక్రమ్ రూ. 10 లక్షలు, హరీశ్ శంకర్ రూ.5 లక్షలు,
రామ్ రూ.25 లక్షలు, బండ్ల గణేశ్ రూ.5లక్షలు, అనిల్ రావిపూడి రూ.5లక్షలు వంతున ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
అధిక వర్షాల కారణంగా హైదరాబాద్ అతలాకుతలమయింది. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది.
ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వాన చినుకులు పడటం మొదలైతే నగర వాసుల్లో ఆందోళన నెలకుంటోంది.