ఇదే నిజం, దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గం పిఏపల్లి మండలంలోని అజ్మాపురం గ్రామానికి చెందిన బాలుడు ఎండలు అధికంగా ఉండడంతో ఎండలకు తట్టుకోలేక మరణించాడు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మాచర్ల కౌశిక్ (12) గత పది రోజుల నుండి అత్యధికంగా ఎండలు మండిపోవడంతో తట్టుకోలేక వడదెబ్బతో మృతి చెందినట్లు తెలిపారు. కౌశిక్ మృతి చెందడంతో తల్లి తండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అజ్మాపురం గ్రామాల్లో ప్రతిఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు.