ఈ ఏడాది జవాన్ సినిమాలో విలన్గా స్టన్నింగ్ యాక్టింగ్తో అదరగొట్టేశాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తెలుగు భాషల్లో ఓ వైపు హీరోగా.. మరోవైపు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ హీరో. ఇక తాజాగా విజయ్ సేతుపతి నటిస్తున్న మరో బాలీవుడ్ మూవీ ‘మేరీ క్రిస్మస్’. కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే.. సినిమా మొత్తం క్రిస్మస్ పండుగ చుట్టూ తిరుగుతుండగా.. సస్పెన్స్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇక ఈ ట్రైలర్ను రెండు భాషల్లో మేకర్స్ కట్ చేశారు. మేరీ క్రిస్మస్ హిందీ ట్రైలర్కు, తమిళ ట్రైలర్కు చాలా తేడా కనిపిస్తోంది. రెండు ట్రైలర్లలో విజయ్, కత్రినా పాత్రలు ఇమాజినరీ లోకంలో మాట్లాడుతున్నట్లు, ఏదో దాచినట్లు సస్పెన్స్గా అనిపిస్తోంది. ఇక ఈ మూవీలొ రాధికా శరత్ కుమార్, సంజయ్ కపూర్, టిన్నూ ఆనంద్ కీలక పాత్రల్లో నటించారు.