Homeజిల్లా వార్తలుత్వరగా ట్రైనింగ్‌కు పంపాలి

త్వరగా ట్రైనింగ్‌కు పంపాలి

  • ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు కానిస్టేబుల్‌ అభ్యర్థులు వినతి పత్రం అందజేత
  • ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి

ఇదేనిజం, ధర్మపురి : ఉద్యోగం సాధించిన కానిస్టేబుల్‌ అభ్యర్థులను త్వరగా ట్రైనింగ్‌కు పిలిచేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాని కానిస్టేబుల్‌ అభ్యర్థులు కోరారు. శుక్రవారం ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు కానిస్టేబుల్‌ అభ్యర్థులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022 మార్చిలో తెలంగాణ ప్రభుత్వం కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిందని, కానిస్టేబుల్‌ తుది ఫలితాలు 2023 అక్టోబరులో రాగా ఈ నోటిఫికేషన్‌ జీవో నెంబర్‌ 46ని అనుసంధానం చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ జీవో నెంబర్‌ 46 ఆధారంగా ఎంతో మంది పేద గ్రామీణ విద్యార్థులు ఉద్యోగం సాధించారు. తుది ఫలితాలు వచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఇంకా ట్రైనింగ్‌కు పిలువకపోవడంతో కానిస్టేబుల్‌కు సెలెక్ట్‌ అయిన అభ్యర్థులు మనోవేదనకు గురవుతున్నామని తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img