Homeహైదరాబాద్latest Newsఆ సంస్థతో త్రివిక్రమ్​ తెగదెంపులు

ఆ సంస్థతో త్రివిక్రమ్​ తెగదెంపులు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో తెరకెక్కించిన ‘గుంటూరు కారం’ ఈ సంక్రాంతికి విడుదలై ఆడియన్స్ నుంచి డివైడ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. చాలామంది త్రివిక్రమ్ రేంజ్ కు తగ్గ కంటెంట్ లేదనే కామెంట్ చేశారు. ఇక చిత్ర యూనిట్ మాత్రం సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చినట్లు చెబుతోంది. ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ త్రివిక్రమ్ భవిష్యత్ ప్రణాళికలపై అనేక రకాల టాక్స్ వైరల్ అవుతున్నాయి.. ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్న త్రివిక్రమ్ ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ అనే బ్యానర్ ని స్థాపించి సితార ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ కి సంబంధించిన బాధ్యతలను త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య చూసుకుంటారు. అయితే ఇకపై సితార ఎంటర్టైన్మెంట్స్ తో ఎలాంటి అసోసియేషన్ లేకుండా సొంతంగా ఫార్చూన్ ఫోర్ సంస్థ పైనే సినిమాలను నిర్మించే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఇప్పటినుంచి త్రివిక్రమ్ పూర్తి స్థాయి ప్రొడ్యూసర్ గా మారబోతున్నారు. అంతేకాకుండా త్రివిక్రమ్ ఇందులో మరొకరిని కూడా భాగస్వామ్యం చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే తన సొంత బ్యానర్ పై నిర్మించే చిత్రాలకు సంబంధించి త్రివిక్రమ్ కొన్ని కథల్ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఫార్చ్యూన్ ఫోర్స్ సినిమాస్ నిర్మాణ సంస్థ నుంచి బిగ్ అనౌన్స్మెంట్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కాగా త్రివిక్రమ్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేస్తున్న విషయం తెలిసిందే. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంటపురములో.. వంటి విజయాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ప్రాజెక్టు కావడంతో అనౌన్స్మెంట్ నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img