హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి. పాపిరెడ్డి శనివారం విడుదల చేశారు.
పరీక్ష రాసిన 63,857 మంది అభ్యర్థులకు గాను 59,113 మంది క్వాలిఫై అయినట్లు పాపిరెడ్డి తెలిపారు.
అర్హత సాధించిన అభ్యర్థులు ర్యాంకు కార్డులను http://eamcet.tsche.ac.in వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకోవాలని పాపిరెడ్డి అభ్యర్థులకు సూచించారు.
మెడిసిన్ అగ్రికల్చర్ విభాగంలో మొత్తం 79,978 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోన్నారు.
గత నెల 28, 29వ తేదీల్లో నిర్వహించిన పరీక్షకు 63,856 మంది హాజరై పరీక్షలు రాసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు.