- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- టీటీఈ తీరుపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆగ్రహం
ఇదేనిజం, నేషనల్ బ్యూరో : రైలు ప్రయాణికుడిపై టీటీఈ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) దాడికి పాల్పడ్డాడు. బరౌనీ-లఖ్నవూ ఎక్స్ప్రెస్లో ఈ ఘటన గురువారం చోటుచేసుకొంది. 25 ఏళ్ల యువకుడు టికెట్తో రైలు నంబరు.15203లో ముజఫర్పూర్ నుంచి లఖ్నవూకు ప్రయాణిస్తుండగా టీటీఈ అతడిపై దాడికి దిగాడు. ప్రయాణికుడి చెంపపై పలుమార్లు కొట్టాడు. అసలు ఎందుకు అతడిపై దాడి చేశాడో తెలియలేదు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీటీఈ చర్యపై నెటిజన్లతో పాటు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మండిపడ్డారు. టీటీఈపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో లఖ్నవూ డివిజన్ డీఆర్ఎం టీటీఈని సస్పెండ్ చేశారు.