Homeహైదరాబాద్latest News'ఇద్దరు భార్యలు ఉంటే రూ.2 లక్షలు'..

‘ఇద్దరు భార్యలు ఉంటే రూ.2 లక్షలు’..

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు కాంతిలాల్ భురియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో గురించి వివరిస్తూ మహాలక్ష్మి పథకం కింద ఒకరికి ఇద్దరు భార్యలు ఉంటే రూ. 2,00,000 ఇస్తామన్నారు. దీంతో అక్కడున్న జనం ఒక్కసారిగా అవాక్కయ్యారు. వేదికపైనే మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జితూ పట్వారీ తదితరులు ఉన్నారు. ఆ తరువాత ‘ఇది చాలా భయంకరమైన ప్రకటన. అంటూ దిద్దుబాటు చర్యలకు యత్నించారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యల్ని పలువురు బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

Recent

- Advertisment -spot_img