నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) నిర్వహించే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సరికొత్త రికార్డులు సృష్టించింది. మే నెలలో 1400 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ఏప్రిల్లో 1330 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఈ ఏడాది మే నెలలో నమోదైన యూపీఐ లావాదేవీలు గతేడాదితో పోలిస్తే 49 శాతం పెరిగాయి. సగటున రోజుకు రూ.65,966 కోట్ల లావాదేవీలు జరిగాయని ఎన్పీసీఐ వెల్లడించింది.