UPSC Civils Prelims Exam 2024:నేడు దేశవ్యాప్తంగా సివిల్స్-2024 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. మొత్తం 1,056 పోస్టులకు 13 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1 ఉదయం 9.30-11.30 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30-4.30 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షకు 30 నిమిషాల ముందు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేస్తారు. ఆ తర్వాత వారిని లోనికి అనుమతించరు. అభ్యర్థులు తప్పనిసరిగా ఫోటో గుర్తింపు కార్డుతో పాటు అడ్మిట్ కార్డును తీసుకెళ్లాలి.